సంబంధిత వార్తలు
- Adilabad: టీ స్టాల్లో ఇంకొకరితో చనువుగా వుందని.. కత్తితో పొడిచి చంపేశాడు..
- తల్లి కళ్ళెదుటే ఇంటర్ విద్యార్థినిని గొంతు కోసి చంపేశాడు...
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృత్యువాత
- Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం
- గోవా నైట్ క్లబ్లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి
ప్రేమికురాలిని దిండుతో చంపేసిన ప్రియుడు
తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో ఓ దారుణం జరిగింది. తాను ప్రేమించిన అమ్మాయిని ప్రియుడు హత్య చేశాడు. దిండుతో గట్టిగా అదిమిపట్టి చంపేశాడు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు..
సేలం జిల్లా అస్తంబట్టి సమీపం సుబ్రహ్మణ్యపురానికి చెందిన భారతి(34) ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. స్థానికంగా ట్యూషన్ సెంటర్ నడుపుతోంది. ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న ఉదయశరణ్(49), భారతి ప్రేమించుకుంటున్నారు. ఇదిలావుండగా, వీరి మధ్య సోమవారం రాత్రి గొడవ జరిగింది.
దీంతో క్షణికావేశానికి గురైన ఉదయశరణ్ ఆమె ముఖాన్ని దిండుతో అదమడంతో స్పృహ కోల్పోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఉదయశరణ్ను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
