Adilabad: టీ స్టాల్లో ఇంకొకరితో చనువుగా వుందని.. కత్తితో పొడిచి చంపేశాడు..
తెలంగాణలో నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం నాగేష్ అనే వ్యక్తి తాను ప్రేమలో ఉన్న 30 ఏళ్ల జె. అశ్వినిని కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత పోలీసులు అక్కడికి చేరుకునే వరకు ఆమె మృతదేహం పక్కనే కూర్చున్నాడు.
నిర్మల్ జిల్లాలోని భైంసాలో విడాకులు తీసుకున్న అశ్విని మరొక వ్యక్తితో మాట్లాడుతుండటం నాగేష్ చూసి ఆమెపై దాడి చేశాడని పోలీసులు తెలిపారు. జీవనోపాధి కోసం నాగేష్ అశ్విని కోసం టీ స్టాల్ ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు. అయితే, అశ్విని టీ స్టాల్కు తరుచూ వచ్చే ఒక వ్యక్తితో చనువుగా ఉంటోందని నగేశ్కు అనుమానం కలిగింది.
ఈ విషయంపై అశ్విని, నగేశ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశానికి లోనైన నగేశ్, అశ్వినిని కత్తితో పొడిచి హత్య చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అశ్వినిని, ఆమె పక్కనే కత్తితో నిలబడి ఉన్న నగేశ్ను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.