Tarun Bhaskar, Isha Rebba
ఫిల్మ్ మేకర్స్ తరుణ్ భాస్కర్. 'ఓం శాంతి శాంతి శాంతిః అనే కొత్త ప్రాజెక్ట్లో మరోసారి లీడ్లో చేస్తున్నారు. ఈషా రెబ్బా హీరోయిన్. A R సజీవ్ దర్శకుడిగా పరిచయం చిత్రం, సహజమైన హాస్యం, ఆకట్టుకునే డ్రామాతో కూడిన వినోదభరితమైన విలేజ్ కామెడీ. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ సంయుక్తంగా సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్ ,నవీన్ సనివరపు నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయి, పోస్ట్-ప్రొడక్షన్ పనులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో, చిత్ర బృందం సినిమా టీజర్ను లాంచ్ చేయడం ద్వారా ప్రమోషన్లపై మొదలుపెట్టింది.
గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ టీజర్ లో కథ అహంకారం, స్వార్థపూరిత స్వభావం గల ధనవంతుడైన చేపల వ్యాపారి అంబటి ఓంకార్ నాయుడు చుట్టూ తిరుగుతుంది. అతను ఓర్పు, సర్దుబాటును కలిగి ఉన్న మంచి, క్రమశిక్షణ కలిగిన మహిళ కొండవీటి ప్రశాంతిని వివాహం చేసుకుంటాడు. వారి విభిన్న వ్యక్తిత్వాలు ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామాకి వేదికగా నిలిచాయి, టీజర్ సూచించినట్లుగా, ఈ కుటుంబ కథా చిత్రంలో ఊహించని మలుపు వుంది.
దర్శకుడు ఎ ఆర్ సజీవ్ దీనిని భిన్నమైన, నవ్వించే మూమెంట్స్ నిండిన ఆరోగ్యకరమైన ఎంటర్టైనర్గా రూపొందించారు. రైటింగ్, కథనం అందరినీ ఆకట్టునేలా వుంది. సినిమాటోగ్రాఫర్ దీపక్ యెరగర గోదావరి జిల్లాల అందాన్ని ఆకట్టుకునే, కంటికి ఆహ్లాదకరమైన ఫ్రేమ్లతో తీశారు, జే క్రిష్ సంగీతం ముఖ్యంగా ఉల్లాసమైన థీమ్ ట్రాక్ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు గొప్పగా వున్నాయి.
గ్రామీణ నేపథ్యంలో సాగే పాత్రలో తరుణ్ భాస్కర్ తన నటనతో కట్టిపడేశారు. ఐపిఎల్ సంభాషణ తన పాత్రని హైలైట్ చేసే హ్యూమరస్ బిట్గా నిలుస్తుంది. ఈషా రెబ్బా తన పాత్రలో ఆకట్టుకుంది. అద్భుతమైన వినోదంతో టీజర్ ప్రామెసింగ్ వుంది. లాంగ్ వీకెండ్ ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో జనవరి 23న రిపబ్లిక్ డే వీకెండ్ లో సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఇది నాకు చాలా పాషనేట్ ప్రాజెక్టు. సినిమా మనకి మరో జీవితం జీవించే అవకాశాన్ని ఇస్తుంది. నాకు అలాంటి అవలాశం ఇచ్చిన నిర్మాత సృజన్, డైరెక్టర్ సజీవ్ కి టీమ్ అందరికీ థాంక్యూ. ఈ సినిమాలో బ్రహ్మాజీ గారికి చాలా మంచి పేరు వస్తుంది. ఆయన వచ్చినప్పుడు విజిల్ కొడతారు. చాలామందికి ఇది రీమేక్ కదా మళ్లీ ఎందుకు చూడాలనే అభిప్రాయం ఉంది. దానికి రీజన్ చెబుతా.. విజయ్ సుపెరుం పౌర్ణమియుం మలయాళం లో వంద రోజులు ఆడిన సినిమా. మలయాళం ప్రేక్షకులు సినిమాని చాలా ఆదరించారు. అది పెళ్లిచూపులు రీమేక్. గోదారి యాస, కల్చర్ కి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా రీసెంట్ టైంలో ఓం శాంతి అవుతుంది. అది గ్యారెంటీగా చెప్తున్నాను. ఓం శాంతి లో కూడా మీకు నిజాయితీ కనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ చేయాలనే ప్యాషన్ తో చేశాను. చాలా ప్రేమతో చేసిన సినిమా ఇది. సినిమా చూసినప్పుడు అది మీకు అర్థమవుతుంది.
హీరోయిన్ ఈషా రెబ్బ మాట్లాడుతూ.. సృజన్ నాకు చాలా రోజుల నుంచి తెలుసు. తను చాలా మంచి సినిమాలు చేసే నిర్మాత. ఫస్ట్ టైం మేము కలిసి పని చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తరుణ్ భాస్కర్ తో నటించే అవకాశం దొరికినందుకు చాలా ఆనందంగా ఉంద. ఆయన డైరెక్షన్లో కూడా నటించే అవకాశం దొరుకుతుందని భావిస్తున్నాను. సజీవ్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు
డైరెక్టర్ సజీవ్ మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నందుతోనే ఉన్నాను. ఎప్పటికీ తనతోనే ఉంటాను. నేను ఇక్కడ ఉండడానికి తనే కారణం. సృజన్ గారిని నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. ఈ సినిమా చూసిన తర్వాత అందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. తరుణ్ గారు నన్ను నమ్మారు. అది నాకు చాలా పెద్ద విషయం. ఆయన చాలా పెద్ద డైరెక్టర్. నన్ను ఒక డబ్ల్యూ డైరెక్టుగా నమ్మడం చాలా సంతోషం అనిపించింది. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.