Telugu Movie Teaser

Notifications

  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్



రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తాను : లింగమనేని రమేష్

రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తాను : లింగమనేని రమేష్రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తానని జనసేన పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన లింగమనేని రమేష్ వెల్లడించారు. ఆయన రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'తనపై నమ్మకంతో రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా అభ్యర్థిత్వాన్ని బలపరిచిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు. రాజ్యసభ వేదికగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తాను అని ఆయన అన్నారు.

ట్రంప్- నెతన్యాహు స్నేహం చెడిందా, ఇరాన్ యుద్దం ఆపేద్దాం అంటుంటే...

ట్రంప్- నెతన్యాహు స్నేహం చెడిందా, ఇరాన్ యుద్దం ఆపేద్దాం అంటుంటే...ఇరాన్ పైన యుద్ధం జస్ట్ కొన్నిరోజుల్లోనే ముగిసిపోతుందని తలచిన ట్రంప్ కు ఆ దేశం నుంచి గట్టి పోటీ ఎదురైంది. యుద్దం మొదలై నెలలు గడుస్తున్నా ఇరాన్ మాత్రం వెనకడుగు వేయడంలేదు. తాము అనుకున్న లక్ష్యం కాస్తాకూస్తో నెరవేరింది కనుక ఇక యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ పైన దాడులు ఆపడంలేదు. ఈ దాడుల కారణంగా ఇరాన్ శాంతి చర్చల్లో పాల్గొనని చెబుతోంది. ఈ దాడులను ఆపాలని అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహుకి చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం వచ్చింది

జంతర్ మంతర్ వద్ద కామెడీ పీస్‌లా మారిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసన? వీడియో చూడండి

జంతర్ మంతర్ వద్ద కామెడీ పీస్‌లా మారిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసన? వీడియో చూడండిపేపర్ పులి అంటాం కదా... అచ్చం అలాగే వున్నట్లుంది కాక్రోచ్ జనతా పార్టీ వ్యవహారం అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఇ ఓఎస్ఎం వ్యవస్థలో అవకతవకలపై జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన కాక్రోచ్ పార్టీకి హాజరైన వారు ఒకింత వింతగా అనిపించినట్లు చెబుతున్నారు. ముఖాలకు బొద్దింక పోస్టర్లు ధరించారు. ఎక్కడబడితే అక్కడ రీల్స్, షార్ట్ వీడియోస్ తీసుకునే పనిలో మునిగిపోయారు. విచిత్ర వేషధారణతో కొంతమంది కనిపించారు. ఈ నిరసనలకు మేము కూడా హాజరవుతామంటూ చెప్పిన పెద్ద తలకాయలు ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాలో మాత్రం బొద్దింక జనతా పార్టీ చేపట్టిన నిరసనలపై సెటైర్లు పేలుతున్నాయి.

ఆ.. కొబ్బరినీళ్లే కదా ఏం చేస్తాయి అని వీళ్లు మాత్రం తాగరాదు, ఎవరు?

ఆ.. కొబ్బరినీళ్లే కదా ఏం చేస్తాయి అని వీళ్లు మాత్రం తాగరాదు, ఎవరు?ఆరోగ్యానికి కొబ్బరి నీరు ఎంతగానో మేలు చేస్తాయి. ఐతే కొంతమంది మాత్రం కొబ్బరి నీరు తాగరాదు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఎవరు తాగకూడదో తెలుసుకుందాము. మధుమేహ వ్యాధిగ్రస్తులు: మధుమేహం వున్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఎందుకంటే కొబ్బరి నీటిలో సహజ చక్కెరలు వుంటాయి. అందువల్ల మోతాదుకి మించి కొబ్బరి నీళ్లు తాగితే రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగి సమస్య వస్తుంది. రక్తపోటు మందులు వాడేవారు: కొబ్బరినీళ్లు రక్తపోటును తగ్గించే గుణాన్ని కలిగి వుంటాయి. అందువల్ల రక్తపోటు తగ్గేందుకు మందులు వాడేవారు మోతాదుకి మించి తాగితే రక్తపోటు తగ్గిపోతుంది. ఫలితంగా మైకం, మత్తుగా అనిపించడం జరుగుతుంది.

సబ్జా గింజల నీటిని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

సబ్జా గింజల నీటిని తాగితే ప్రయోజనాలు ఏమిటి?సబ్జా గింజలు. ఇవి ఆయుర్వేద ఔషధాలలో ఈ గింజలు కీలకం. వీటిని తీసుకుంటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. సబ్జా గింజలు తీసుకుంటే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, టైప్ 2 మధుమేహం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. సబ్జా గింజల మిల్క్ షేక్ తాగితే చాలాసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. సబ్జా విత్తనాల్లో మల్టీవిటమిన్‌లతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. సబ్జాల్లో వున్న ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్‌ శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. సబ్జా గింజలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది, ఇది టైప్ 2 డయాబెటిస్ రోగులకు మంచిది.

కావేరీ ఆస్పత్రిలో అరుదైన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్