1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 జూన్ 2023 (17:35 IST)

23 చెంప దెబ్బలు కొట్టిన టీచర్.. ఎలుకల మందు ఆరగించి విద్యార్థి ఆత్మహత్య

sadist
సహచర విద్యార్థుల ముందు క్లాస్ టీచర్ ఓ విద్యార్థిని 23 సార్లు చెంప దెబ్బలు కొట్టాడు. దీన్ని అవమానంగా భావించాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వైట్‌ఫీల్డ్ సమీపంలోని చన్నసంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బుధవారం విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాఠశాల డైరీలో సూచనలు రాసి తల్లిదండ్రులకు పంపమని టీచర్‌ను విద్యార్థి కోరాడు. అయితే, విద్యార్థి మధ్యలో కలుగజేసుకుని మాట్లాడినందుకు ఉపాధ్యాయుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో విద్యార్థిని 23 సార్లు చెంపపై కొట్టాడు. దీంతో చెంపకు కూడా గాయమైంది. చిన్నారు చెంపపై వాపు కనిపించడాన్ని తల్లి గుర్తించి ఏమైందని ప్రశ్నించగా, జరిగిన విషయమంతా చెప్పాడు. 
 
తల్లి వెంటనే చిన్నారి తండ్రికి ఫోన్ చేసి విషయాన్ని వివరించింది. దీంతో మరుసటి రోజు స్కూలుకు వెళ్లి పాఠశాల యాజమాన్యానికి విద్యార్థి తల్లిదండ్రులు చెప్పారు. 30 నిమిషాల్లో 23 సార్లు కొట్టాడని, అందువల్ల ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరారు. దీంతో సదరు యాజమాన్యం ఆ టీచర్‌ను ఇంటికి పంపించాడు. ఇక్కడ విచిత్రమేమిటంటే.. గత వారమే సదరు గురువుకు వివాహం జరగడం గమనార్హం.