1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Youth Killed and Dumped in Borewell Over Alleged Relationship Issue, Yerragondapalem

కుమార్తెతో సన్నిహితంగా ఉంటున్నాడనీ యువకుడిని చంపి ముక్కలు చేసిన దంపతులు

murder
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్కాపురం జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని యర్రగొండపాలెంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తమ కుమార్తెతో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని భార్యాభర్తలు ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ యువకుడుని హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి బోరుబావిలో పడేసినట్టు పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 
 
మృతుడుని ఆంజనేయులుగా గుర్తించారు. ఈ నెల 13వ తేదీన కనిపించకుండా పోయాడు. దీనిపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... లోతుగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హత్య చేసిన దంపతులను నారాయణ, రవణ దంపతులుగా గుర్తించారు. 
 
తమ కుమార్తెతో ఆ యువకుడు సన్నిహితంగా ఉండటం చూసి భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో నిందితులు అంగీకరించారు. దంపతులిద్దరినీ యర్రగొండపాలెం పోలీసులు అదుపులోకి తీసుకుని ఈ ఘాతుకంపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. మృతదేహం ముక్కలను బోరు బావిలో పడేయడంతో వాటిని తీయడం కష్టసాధ్యంగా మారింది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అసలే ఎండలు.. చాలదన్నట్లు ఏపీ గోదావరి జిల్లాల్లో తాగునీటి కొరత.. అలా చేయకపోతే..?