శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2022 (09:49 IST)

టీటీడీ ఆస్తుల విలువ విప్రో, నెస్లో, ఓన్జీజీసీ కంటే అధికం!!

tirumala
కలియుగ వైకుంఠంగా భక్తులతో నీరాజనాలు అందుకుంటున్న శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైవున్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇటీవల ఓ కీలక ప్రటన చేసింది. టిటిడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ శ్వేతపత్రంలో మొత్తం ఆస్తుల వివరాలను వెల్లడించింది.
 
ఇందులో డబ్బుల రూపంలో 24 బ్యాంకుల్లో డిపాజిట్లు ఉండగా, రెండు బ్యాంకుల్లో బంగారాన్ని డిపాజిట్ చేసినట్టు తెలిపింది. భారతీయ స్టేట్ బ్యాంకులో సెప్టెంబరు 30వ తేదీ నాటికి 9818.38 కిలోల బంగారం బంగారం నిల్వలు ఉన్నాయి. అలాగే, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో సెప్టెంబరు 30వ తేదీ నాటికి 438.99 కిలోల బంగారం డిపాజిట్ చేసివుంచారు. 
 
ఇకపోతే నగదు డిపాజిట్లలో ఎస్.బి.ఐలో రూ.5358.11 కోట్లు ఉండగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.1694.5 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.1839.36 కోట్లు, కెనరా బ్యాంకులో రూ.1351 కోట్లు, యాక్సిస్ బ్యాంకులో రూ.1006.20 కోట్లు, హెచ్‌డీఎఫ్సీలో రూ.2122.85 కోట్లు, పబంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.660.43 కోట్లు, పంజాబ్ సింధ్ బ్యాంకులో రూ.306.31 కోట్లు ఉన్నాయి. 
 
అలాగే, ఇండియన బ్యాంకులో రూ.25.30 కోట్లు, సప్తగిరి గ్రామీణ బ్యాంకులో రూ.99 కోట్లు, యునైటెడ్ కమర్షియల్ బ్యాంకులో రూ.18 కోట్లు,  ఐఓబీలో రూ.101 కోట్లు చొప్పున మొత్తం రూ.15938 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఐటీ దిగ్గజం కంపెనీ విప్రో, ప్రభుత్వ రంగ సంస్త ఓఎన్జీసీ, ఆహార ఉత్పత్తుల సంస్థ నెస్లే కంటే టిటిడీ ఆస్తుల విలువ అధికం కావడం గమనార్హం.