బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 22 డిశెంబరు 2018 (14:28 IST)

గ్లాస్ నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే..?

ఈ చలికాలంలో దాహం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. చల్లని గాలిని మనం పీల్చినప్పుడు ఆ గాలి శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు మనకు నీరు ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది. కానీ, సమయానికి నీరు దొరకకపోవడంతో.. బయట దొరికే శీతల పానీయాలు తీసుకుంటుంటారు. అలా చేయడం వలన ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు.. నిపుణులు.. 
 
మనిషి శరీరంలో నుండి ఒక రోజులో 700 నుండి 1000 గ్రాముల నీరు చెమట రూపంలో బయటకు పోతుంటుంది. అదే సమయంలో శరీరంలోపల 300 నుండి 400 గ్రాముల నీరు తయారవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ బయటకుపోయే నీరు ఎక్కువగా ఉన్నాయి. లోపల ఊరే నీరు తక్కువ. ఇలా నీటి శాతం తగ్గినప్పుడు దాహం వేస్తుంది. రక్తంలో ఉప్పు, నీరు కలిసి ఉంటాయి. ఏ కారణం చేతైన రక్తంలో నీటి శాతం తగ్గినట్లైతే దాహం వేస్తుంది. 
 
కొందరికైతే వేసవి కాలం, వర్షా కాలం అనే తేడాలు లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు దాహం వేస్తుంటుంది. వారికి ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. ఎటువంటి వారికైనా దాహం వేస్తుంటే గ్లాస్ చల్లని నీటిలో నాలుగు స్పూన్ల చక్కెర, ఒక నిమ్మకాయను పిండి తీసిన రసం కలిపి తాగితే వెంటనే దాహం తగ్గుతుంది. అదేవిధంగా దానిమ్మ పండ్ల రసానికి సమంగా పంచదార కలిపి తేనె పాకంగా ఉడికించి రెండు స్పూన్ల చొప్పున రోజుకి మూడుసార్లు తాగితే దాహం తగ్గుతుంది.