సంబంధిత వార్తలు
- ఫ్యామిలీ పర్సన్లకు ఓకే కానీ.. బ్యాచిలర్స్కు చుక్కలు.. ఆ టాయ్స్ కోసం..?
- జూన్ వరకు థియేటర్లలో బొమ్మపడటం కష్టమేనట!!
- లాక్డౌన్పై కీలక ప్రకటన చేయనున్న ప్రధాని మోడీ
- వృద్ధాప్యాన్ని లెక్కచేయ అంజనాదేవి ... మాస్కుల తయారీలో చిరంజీవి తల్లి
- ఫ్రస్టేషన్లో పెళ్లాలను కొడుతున్నారన్న ఆర్జీవీ.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన కేటీఆర్
లాక్ డౌన్లో వున్నారా? ఉసిరికాయ జ్యూస్ తప్పక తాగాలట..
లాక్ డౌన్లో వున్నారా? ఉసిరికాయ జ్యూస్ తప్పకుండా తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరి శరీర రోగ నిరోధక వ్యవస్థను పెంచి జలుబు, దగ్గును దూరం చేస్తుంది. ఉసిరిలోని విటమిన్ సి గుండె సంబంధిత రోగాలను దూరం చేస్తుంది. క్యాన్సర్కు చెక్ పెడుతుంది. ఉసిరి, కొవ్వు పదార్థాలను తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తుంది. ఉసిరిని తినటం వలన రక్తనాళాలలో ఉండే కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి, గుండె సంబంధిత వ్యాధులను కలగకుండా చేస్తుంది. ఉసిరిలో అధిక మొత్తం ఫైబర్ వుండటం వల్ల జీర్ణక్రియ సమస్యలను సులభంగా తగ్గిస్తుంది.
ఉసిరికాయను తరచూ ఆహారంలో తీసుకుంటే తల వెట్రుకలు త్వరగా తెల్లబడవు, చర్మం మృదువుగా ఉంటుంది. కీళ్ల నొప్పులు, దంత సంబంధమైన సమస్యలు ధరి చేరవు. ఈ పండ్లు తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే ఆకలి కూడా త్వరగా వేస్తుంది.
ఇసినోఫీలియా, అలర్జీతో తరచూ బాధపడే వారు ఒక చెంచా ఉసిరిరసంలో కొద్దిగా తేనె కలుపుకొని తాగితే ఉపశమనం పొందుతారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో ఉసిరి బాగా పని చేస్తుంది.
జ్ఞాపక శక్తి తక్కువగా ఉండే పిల్లలకు ఈ పండ్లు తినిపిస్తే సరిపోతుంది. ఉసిరికాయ గుండె సంబంధిత వ్యాధులను, ఆందోళనలను, అధిక రక్తపోటును తగ్గిస్తుంది. చర్మ సమస్యలు ఉన్న వారు ఉసిరి రసాన్ని చర్మంపై రాసుకుంటే చర్మ సమస్యలు దూరం అవుతాయి. అంతే కాదు ఉసిరికాయ పొడిని, శనగ పిండిలో కలుపుకొని స్నానం చేస్తే చర్మం మృదువుగా, తాజాగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
తర్వాతి కథనం
