1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. 300 terrorists killed in Indian airstrikes

భారత్‌ వైమానిక దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు హతం.. గుట్టు విప్పిన పాక్ మాజీ దౌత్యవేత్త

terrorists
2019లో పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ జరిపిన వైమానిక దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్టు పాకిస్థాన్‌ మాజీ దౌత్యవేత్త అఘా హిలాలీ వెల్లడించారు. టీవీ చర్చల్లో పాక్‌ సైన్యం తరఫున మాట్లాడే ఆయన ఓ ఉర్దూ ఛానెల్‌తో ఈ విషయాన్ని తెలిపారు.

ఈ దాడిలో ఎవరూ చనిపోలేదంటూ చెప్పుకుంటున్న పాకిస్తాన్‌కు ఈ వ్యాఖ్యాలతో ఇరుకున పడ్డట్టు అయింది. 2019 ఫిబ్రవరి 14న జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామాలో సిఆర్‌పిఎఫ్‌ జవాన్లపై జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు ఆత్మాహతి దాడికి పాల్పడగా..40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనపై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు ప్రతిస్పందనగా భారత్‌ బాలకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది.

ఈ దాడిలో ఎవ్వరూ చనిపోలేదని ఆనాడు పాక్‌ చెప్పుకురాగా..తాజాగా మాజీ దౌత్యవేత్త 300 మంది చనిపోయినట్లు చెప్పడంతో..గతంలో పాక్‌ చెప్పినవన్నీ అబద్ధాలేనని తేలింది.
About Writer
ఎం
తర్వాతి కథనం
తొలి సుదూర నాన్‌స్టాప్‌ విమాన సారథులు