1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. agustawestland scam

అగస్టా స్కామ్ : భారత నేతలకు ఇచ్చిన లంచం రూ.115 కోట్లు.. ఇటలీ కోర్టు

agustawestland scam
వీఐపీల సేవల కోసం భారత ప్రభుత్వం కొనుగోలు చేసిన అగస్టా హెలికాప్టర్ల వ్యవహారంలో కుంభకోణం జరిగిందని ఇటలీ కోర్టు స్పష్టం చేసింది. ఈ స్కామ్‌లో భారతీయ నేతలకు రూ.115 కోట్లు ముట్టజెప్పినట్టు కోర్టు పేర్కొంది. అగస్టా‌వెస్ట్‌ల్యాండ్ కంపెనీ నుంచి 12 హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఇందుకోసం రూ.3,600 కోట్లు వెచ్చించింది. ఈ భారీ కాంట్రాక్టును దక్కించుకునేందుకు అగస్టా కంపెనీ ఏకంగా భారతీయ కరెన్సీలో రూ.227 కోట్లుగా ఖర్చు చేయగా, ఇందులో రాజకీయ నేతల వాటాను ఆ కోర్టు రూ.115 కోట్లుగా తేల్చింది. ఈ మేరకు 225 పేజీల తీర్పు కాపీలో ఇటలీ కోర్టు స్పష్టంగా పేర్కొంది. తీర్పు కాపీలోని 9వ పేజీలోనే పేర్కొంది. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
సునంద పుష్కర్ కేసు : ఫోరెన్సిక్ సాక్ష్యాల విశ్లేషణకు కొత్త వైద్య బృందం