లడఖ్ సమస్యను పరిష్కరించేందుకు సిద్ధం - చైనా ప్రకటన
Ladakh
సరిహద్దు సమస్యలపై శనివారం జరగనున్న మిలటరీ స్థాయి అధికారుల సమావేశానికి ఒక రోజు ముందు చైనా ఈ ప్రకటనను వెలువరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతానికైతే భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితి స్థిరంగా, అదుపులోనే వుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ తెలిపారు.
సైన్యం, దౌత్యపరమైన మాధ్యమాలున్నప్పటికీ...తాము ఎప్పటిలాగానే సమాచారాన్ని చేరవేస్తున్నామని చెప్పారు. అలాగే సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు తాము చిత్తశుద్ధితో కట్టుబడి వున్నామని తెలిపారు.
