1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. India and Pakistan: Reversing roles

మోడీ ప్రధానిగా ఉన్నంతవరకు మనం ఏకాకులమే : పాకిస్థాన్

భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నంతకాలం మనం ఏకాకులంగానే ఉంటామని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భా

India
భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నంతకాలం మనం ఏకాకులంగానే ఉంటామని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌తో సంబంధాలు మెరుగుపడతాయనే ఆశ తమకు లేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ భారత్ 'ఆధిపత్య ధోరణి' ప్రదర్శిస్తోందంటూ విమర్శల దాడి చేశారు. ఆసియా ప్రాంతంలో భారత్ ఆధిపత్య ధోరణిని పాకిస్థాన్ విభేదిస్తోందని, సమాన ప్రాతిపదికనే ద్వైపాక్షిక సంబంధాలు ఉండితీరాలని ఆయన పేర్కొన్నారు. 'మోడీ ప్రధానిగా ఉండగా భారత్‌తో సంబంధాల్లో పురోగతి ఉంటుందనే ఆశ మాకు (పాక్) లేదు' అని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నట్టు అసోసియేట్ ప్రెస్ ఆఫ్ పాకిస్థాన్ (ఏపీపీ) తెలిపింది. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఎల్‌వోసీ వద్దకు భారీగా పాకిస్థాన్ బలగాల మొహరింపు.. యుద్ధం తప్పదా?