సంబంధిత వార్తలు
- దైవానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా... మరణానికి కొద్ది నిమిషాల ముందు ఖమేనీ ట్వీట్
- నూడుల్స్ వల్ల చాపకింద నీరులా వ్యాపిస్తున్న బ్యాక్టీరియా.. 49మంది పరిస్థితి విషమం
- పాకిస్థాన్లో ఘోరం : లోయలో పడిన బస్సు - 40 మంది మృత్యువాత
- రూ.1.9 కోట్ల వేతనం.. చాక్లెట్ కుకీన దొంగిలించిన ఉద్యోగి - తొలగించిన కంపెనీ
- ఇరాన్ ప్రతినిధుల హత్యకు ఇజ్రాయెల్ కుట్ర? అమెరికా ఆందోళన
అలీ ఖమేనీ అంత్యక్రియలు.. గుండెల్లో బాదుకున్న జనం.. ప్రతీకారం అంటూ నినాదాలు
Ayatollah Ali Khamenei
మూడున్నర దశాబ్దాల పాటు దేశాన్ని నడిపిన ఈ నాయకుడికి నివాళులర్పించేందుకు, రాబోయే మూడు రోజుల్లో ఒక్క టెహ్రాన్ నగరంలోనే 1.5 నుండి 2 కోట్ల మంది ప్రజలు పాల్గొంటారని ఇరాన్ అధికారులు అంచనా వేస్తున్నారు.
1989 నుండి ఇరాన్తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన రోజున (ఫిబ్రవరి 28న) 86 ఏళ్ల వయసులో మరణించే వరకు ఇస్లామిక్ రిపబ్లిక్ను అత్యున్నత నాయకుడిగా పాలించిన ఖమేనీ స్మృత్యర్థం ఆరు రోజుల పాటు అంత్యక్రియల కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమాల్లో ఖమేనీ కుమారుడు, ఆయన వారసుడైన మొజ్తాబా ఖమేనీకి సంబంధించిన సంకేతాల కోసం ప్రత్యేకంగా నిశిత పరిశీలన జరగనుంది. తండ్రి మరణం తర్వాత వారం రోజులకే ఆయన 'సుప్రీం లీడర్'గా ప్రకటించబడినప్పటికీ, ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు.
జూలై 4, 5 తేదీలు తెహ్రాన్లో సెలవు కాగా, జూలై 6 జాతీయ సెలవు దినంగా ప్రకటించినట్టు నిర్వాహక కమిటీ అధిపతి, ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రజా ఆరిఫ్ చెప్పారు. ఈ కార్యక్రమాలకు కోటీ 20 లక్షల మంది నుంచి కోటీ 50 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా.
ఇకపోతే.. హతమైన అయతుల్లా అలీ ఖమేనీకి తుది వీడ్కోలు పలికేందుకు శనివారం ఉదయం టెహ్రాన్లో వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు తమ గుండెలను బాదుకుంటూ ప్రతీకారం, ప్రతీకారం అని నినదించారు. ఖమేనీ, ఫిబ్రవరి చివరలో జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. ఈ దాడులు ఆ ప్రాంతంలో యుద్ధానికి దారితీశాయి. శనివారం ఉదయం ఇరాన్ రాజధానిలోని విశాలమైన గ్రాండ్ మోసల్లా ప్రార్థనా ప్రాంగణంలో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.
