1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Iran Begins Days-Long Funeral for Ayatollah Ali Khamenei

అలీ ఖమేనీ అంత్యక్రియలు.. గుండెల్లో బాదుకున్న జనం.. ప్రతీకారం అంటూ నినాదాలు

Ayatollah Ali Khamenei
Ayatollah Ali Khamenei
ఇరాన్ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు శనివారం అధికారికంగా ప్రారంభమయ్యాయని ప్రభుత్వ టెలివిజన్ నివేదించింది. మరణించిన నాలుగు నెలల తర్వాత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగనున్నాయి. వేలాది మంది ప్రజలు హాజరైన ఈ కార్యక్రమం, ఇస్లామిక్ రిపబ్లిక్ శత్రువులకు తమ బలాన్ని ప్రదర్శించే వేదికగా కూడా నిలిచింది.
 
మూడున్నర దశాబ్దాల పాటు దేశాన్ని నడిపిన ఈ నాయకుడికి నివాళులర్పించేందుకు, రాబోయే మూడు రోజుల్లో ఒక్క టెహ్రాన్ నగరంలోనే 1.5 నుండి 2 కోట్ల మంది ప్రజలు పాల్గొంటారని ఇరాన్ అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
1989 నుండి ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన రోజున (ఫిబ్రవరి 28న) 86 ఏళ్ల వయసులో మరణించే వరకు ఇస్లామిక్ రిపబ్లిక్‌ను అత్యున్నత నాయకుడిగా పాలించిన ఖమేనీ స్మృత్యర్థం ఆరు రోజుల పాటు అంత్యక్రియల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 
 
ఈ కార్యక్రమాల్లో ఖమేనీ కుమారుడు, ఆయన వారసుడైన మొజ్తాబా ఖమేనీకి సంబంధించిన సంకేతాల కోసం ప్రత్యేకంగా నిశిత పరిశీలన జరగనుంది. తండ్రి మరణం తర్వాత వారం రోజులకే ఆయన 'సుప్రీం లీడర్'గా ప్రకటించబడినప్పటికీ, ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు.
 
జూలై 4, 5 తేదీలు తెహ్రాన్‌లో సెలవు కాగా, జూలై 6 జాతీయ సెలవు దినంగా ప్రకటించినట్టు నిర్వాహక కమిటీ అధిపతి, ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రజా ఆరిఫ్ చెప్పారు. ఈ కార్యక్రమాలకు కోటీ 20 లక్షల మంది నుంచి కోటీ 50 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా.
 
ఇకపోతే.. హతమైన అయతుల్లా అలీ ఖమేనీకి తుది వీడ్కోలు పలికేందుకు శనివారం ఉదయం టెహ్రాన్‌లో వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు తమ గుండెలను బాదుకుంటూ ప్రతీకారం, ప్రతీకారం అని నినదించారు. ఖమేనీ, ఫిబ్రవరి చివరలో జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. ఈ దాడులు ఆ ప్రాంతంలో యుద్ధానికి దారితీశాయి. శనివారం ఉదయం ఇరాన్ రాజధానిలోని విశాలమైన గ్రాండ్ మోసల్లా ప్రార్థనా ప్రాంగణంలో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
చీరాలలో ఆరునెలల పసిబిడ్డ కిడ్నాప్.. లక్షకు విక్రయం.. 24 గంటల్లో కనిపెట్టేశారుగా..