1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. WHO Chief Warn about Omicron Virus Spread

ఒమిక్రాన్‌తో జాగ్రత్తగా ఉండాలి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్

Omicron Virus
ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్‌తో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ హెచ్చరించారు. ఈ కొత్త వేరియంట్ మరో రెండు మూడు రోజుల్లో మరింత శరవేగంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వైరస్ ఇప్పటికే అగ్రదేశం అమెరికాతో పాటు యూకే వంటి దేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తుందని గుర్తుచేశారు. డిసెంబరు 20వ తేదీ నుంచి 26వ తేదీలోపు ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగాయని ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా, వచ్చే 2, 3 రోజుల్లో ఈ వైరస్ మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. 
 
మరోవైపు, ఈ వైరస్ భారత్‌లోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. మంగళవారం ఒక్క రోజే ఏకంగా 127 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 750ను దాటిపోయింది. ముఖ్యంగా, భారత్‌లో గత వారం వరకు కేవలం 7లోపు మాత్రమే ఉన్న ఈ పాజిటివ్ కేసుల సంఖ్య ఈ వారంలో ఏకంగా ఏడు వందలకు పైగా నమోదయ్యాయని టెడ్రోస్ హెచ్చరించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఏపీలో రానున్న మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు