1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 డిశెంబరు 2021 (14:29 IST)

బద్వేల్ ఉప ఎన్నికల్లో లాగులు తడిసిపోయాయి..: సోము వీర్రాజు

గతంలో జరిగిన బద్వేల్ ఉప ఎన్నికల్లో అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీలకు లాగులు తడిసిపోయాయని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఏపీ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ ప్రజాగ్రహ సభ విజయవంతమైంది. దీంతో బీజేపీ నేతలు, శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 
 
దీనిపై సోము వీర్రాజు మాట్లాడూడుతూ, రాబోయే రోజుల్లో పార్టీ దూకుడు పెంచుతామన్నారు. ఏపీలో శూన్యత ఏర్పడివుందన్నారు. దీన్ని భర్తీ చేస్తామని చెప్పారు. ఇపుడు ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్నారు. అన్ని పార్టీలకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఉంటే బీజేపీ దగ్గర ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నాయన్నారు.
 
కాగా, మంగళవారం జరిగిన ప్రజాగ్రహ సభలో సోము వీర్రాజు కమ్యూనిస్టు పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. కమ్యూనిస్టులను మొరిగే కుక్కలతో పోల్చారు. జగడగాలు పెట్టి డబ్బులు వసూలు చేసుకునే పార్టీలని ఆయన ఆరోపించారు.