1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 29 డిశెంబరు 2021 (14:38 IST)

భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్ ను స‌న్మానించిన సీఎం జ‌గ‌న్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి తొలి భారత పురుష షట్లర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించిన కిడాంబి శ్రీకాంత్ ను సీఎం అభినందించారు.

 
ఈ ఏడాది డిసెంబర్‌ 12 నుంచి 19 వరకు స్పెయిన్‌లో జరిగిన 2021 బీడబ్యూఎఫ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్ రజత పతకం సాధించాడు. శ్రీకాంత్‌ను ఘనంగా సన్మానించిన సీఎం వైఎస్‌ జగన్, ప్రభుత్వం తరపున రూ. 7 లక్షల నగదు బహుమతి, తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కేటాయించారు. ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌గా  శ్రీకాంత్ విధులు నిర్వహిస్తున్నాడు. 
 
 
ఈ కార్యక్రమంలో టూరిజం, క్రీడా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, స్పెషల్‌ సీఎస్‌ జి.సాయిప్రసాద్, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్ధ్‌ రెడ్డి, శాప్‌ ఎండీ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌ రెడ్డి, శాప్‌ ఓఎస్డీ రామకృష్ణ, శ్రీకాంత్‌ తల్లిదండ్రులు రాధాముకుంద, కేవీఎస్‌ కృష్ణ పాల్గొన్నారు.