1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. samsung smart phone are sending owners messages to the contacts

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్స్ ఎవరైతే వాడుతున్నారో? వారికి ఈ హెచ్చరికా.....

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్స్ ఎవరైతే వాడుతున్నారో వారు తీసుకోవలసిన జాగ్రత్తలు. కొన్ని డివైజ్‌లు, మెుబైల్ యూజర్లు స్టోర్ చేసుకున్న ఫోటోలను వారి అనుమతి లేకుండా స్మార్ట్‌ఫోన్‌లోని ఇతర కాంటాక్ట్‌లకు పంపుతున్నట్

samsung
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్స్ ఎవరైతే వాడుతున్నారో వారు తీసుకోవలసిన జాగ్రత్తలు. కొన్ని డివైజ్‌లు, మెుబైల్ యూజర్లు స్టోర్ చేసుకున్న ఫోటోలను వారి అనుమతి లేకుండా స్మార్ట్‌ఫోన్‌లోని ఇతర కాంటాక్ట్‌లకు పంపుతున్నట్లుగా సమాచారం అందింది. శాంసంగ్ మెసేజస్ కలిగి ఉన్నవారికి ఈ సమస్య తలెత్తిన్నట్లు గిజ్‌మోడో తొలుత రిపోర్టు చేసింది.
 
ఫైల్స్‌ను పంపుతున్నప్పటికి దాన్ని యూజర్లకు కూడా తెలుపడం లేదని రిపోర్టు తెలియజేసింది. ఈ శాంసంగ్ ఫోన్లలో శాంసంగ్ మెసేజస్ అనేది ఒక డిఫాల్ట్ మెసేజింగ్ యాప్. దీనిలోని బగ్ కారణంగా ఈ సమస్య తలెత్తుతున్నట్లు తెలిసింది. గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్ స్మార్ట్‌ఫోన్స్ డివైజ్‌లు దీని బారిన పడ్డాయి. కేవలం ఈ రెండు మోడల్స్ మాత్రమే ఈ సమస్య పరిమితం కాలేదని వెర్జ్ రిపోర్టులో వెల్లడైంది.
 
ఈ రిపోర్టులు తమ దృష్టికి వచ్చాయని, తమ టెక్నికల్ టీమ్స్ దీన్ని విచారిస్తున్నరని శాంసంగ్ ప్రకటనను విడుదల చేసింది. దీని బారిన పడిన కస్టమర్ల 1-800-శాంసంగ్ వద్ద తమను డైరెక్ట్‌గా చేయవలసినదిగా శాంసంగ్ కోరింది. అనుమతి లేకుండా ఫోటోలను, డేటాను కాంటాక్ట్‌లకు పంపే బగ్ బారిన పడకుండా ఉండేందుకు శాంసంగ్ మెసేజస్ అనుమతులను యూజర్లు ఉపసంహరించుకోవచ్చని శాంసంగ్ తెలియజేసింది.
About Writer
Kowsalya
తర్వాతి కథనం
బీహార్ సీఎంను ఇంట్లోకి అడుగుపెట్టనివ్వను : తేజ్ ప్రసాద్ యాదవ్