1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Vodafone Idea to upgrade 3G users to 4G in phased manner

ఇకపై 3సేవలను 4జీగా మార్చేస్తున్నాం.. వొడాఫోన్, ఐడియా

Vodafone
భారత్‌లో వొడాఫోన్, ఐడియా సంస్థలు తమ వినియోగదారులకు అందించే 3సేవలను 4జీగా మార్చాలనే నిర్ణయానికి వచ్చింది. భారత్‌లో ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోతో పోటీపడేందుకు టెలికాం రంగ సంస్థలన్నీ తట్టుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలో వొడాఫోన్, ఐడియా సంస్థలు గత 2018లో చేతులు కలిపాయి. అయినప్పటికీ గత నెలలో ఈ సంస్థలు ''విఐ''గా మారాయి. 
 
తాజాగా కస్టమర్లకు అతివేగంగా ఇంటర్నెట్ సేవలను అందించేందుకు గాను... 3జీ సేవలను 4జీ సేవలుగా అందించేందుకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించాయి. పలు విడతలుగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తాయి. అందుచేత 900ఎంహెచ్‌జెడ్, 1800ఎంహెచ్‌జెడ్, 2100 ఎంహెచ్‌జెడ్ వేవ్స్‌కు మార్చేందుకు సిద్ధంగా వుంది. అదే సమయంలో 2జీ సేవలను వాయిస్ కాల్స్ సేవల ద్వారా అందించనుంది. ఈ సేవలు దేశంలో 100 కోట్ల భారతీయులకు అందించడం జరుగుతుందని సంస్థ తెలిపింది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
వాహనదారులకు నయా రూల్స్.. అక్టోబరు 1 నుంచి అమలు!!