1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Earthquake in Manipur

మణిపూర్‌లో భూకంపం

Earthquake
మణిపూర్‌లోని ఉక్రూల్‌ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేలుపై తీవ్రత 4.3గా నమోదైంది. బుధవారం తెల్లవారుజామున 3.32 నిమిషాలకు ఈ భూకంపం సంభవించిందని, భూకంప కేంద్రం పదికిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు.

అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అన్నారు. గత నెల ఒకటిన కూడా ఉక్రూల్‌ నగరానికి 55 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని, రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదైందని అన్నారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
కరోనా గురించి చాలా తెలుసుకున్నా: ట్రంప్‌