1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Hyderabad Murder: Latest News

ప్రియుడి కోసం భర్తను ఉరేసి చంపేసింది.. ఆపై గుండెపోటు వచ్చిందని?

ప్రియుడి కోసం ఓ మహిళ భర్తను చంపేసి నాటకమాడింది. భర్తకు గుండెపోటు వచ్చిందంటూ ఆస్ప్రత్రికి తీసుకెళ్లి జైలు పాలైంది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా పనుకువలస గ్రామానికి చెందిన జగదీశ్వర్ రావుకు ఎనిమి

Hyderabad Murder
ప్రియుడి కోసం ఓ మహిళ భర్తను చంపేసి నాటకమాడింది. భర్తకు గుండెపోటు వచ్చిందంటూ ఆస్ప్రత్రికి తీసుకెళ్లి జైలు పాలైంది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా పనుకువలస గ్రామానికి చెందిన జగదీశ్వర్ రావుకు ఎనిమిదేళ్ల క్రితం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన తులసీతో వివాహమైంది. జగదీశ్వర్-తులసీ దంపతులు ఇద్దరు కుమారులు. 
 
హైదరాబాదులోని బాలానగర్‌లో జగదీశ్వర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో పరిచయమైన వీరబాబు.. అప్పుడప్పుడు జగదీశ్వర్ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో తులసికి వీరబాబుల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం గురించి తెలుసుకున్న జగదీశ్వర్ తులసిని మందలించాడు. అయినా తులసీ ప్రవర్తన మార్పులేదు. 
 
అయితే తులసి భర్తను వదిలించుకోవాలనుకుంది. చీరతో ఉరేసి భర్తను పక్కా ప్లాన్ ప్రకారం చంపేసింది. చివరికి భర్తకు గుండెపోటు వచ్చిందంటూ ఆస్పత్రికి తరలించింది. అయితే వైద్యులు అతనికి గుండెపోటు రాలేదని.. ఎవరో హత్య చేశారని తేల్చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తులసి, వీరబాబు విచారణలో నేరాన్ని అంగీకరించడంతో జైలు పాలయ్యారు.
తర్వాతి కథనం
పక్కింటి బాత్రూమ్‌లో కెమెరా.. కనిపెట్టేశాక...?