1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. PM Modi applauded DRDO scientists for Agni-5

అగ్ని-5 క్షిపణి ప్రయోగం సక్సెస్.. దివ్యాస్త్రపై సైంటిస్టులపై ప్రశంసలు

PM Modi
PM Modi
అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. తద్వారా భారత్ రక్షణ రంగ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. అగ్ని-5 క్షిపణిలో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్వీ) టెక్నాలజీ వినియోగించారు. 
 
మొట్టమొదటి ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ డీఆర్డీవో సైంటిస్టులను అభినందించారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలు చేపట్టిన మిషన్ దివ్యాస్త్ర పట్ల గర్విస్తున్నానని తెలిపారు. ఈ ప్రాజెక్టును మిషన్ దివ్యాస్త్రగా పేర్కొంటున్నారు. 
 
కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా అగ్ని-5 పరీక్షపై స్పందించారు. ఇక నుంచి భారత్‌పై ఎవరైనా దాడి చేయాలనుకుంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
తర్వాతి కథనం
శివయ్య నిమ్మకాయ.. వేలంలో రూ.35వేలు పలికింది..