బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By సిహెచ్
Last Updated : గురువారం, 21 మే 2020 (21:53 IST)

పెరుగుదలతో స్థిరపడిన స్టాక్ మార్కెట్, ప్రగతిపథం వైపు నడిపిన ఎయిర్ లైన్స్

భారత ఈక్విటీ మార్కెట్లు ఉదయం సానుకూల ప్రారంభంతో మంచి లాభాలను నమోదు చేశాయి. అయితే ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి, ఎఫ్‌ఎంసిజి మరియు బ్యాంకింగ్ రంగాలు బలహీనత సంకేతాలను చూపించాయి, తత్ఫలితంగా పూర్తి సెషన్‌కు స్వల్ప లాభాలు మాత్రమే వచ్చాయి.
 
ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ 114 పాయింట్లు లేదా 0.37 శాతం పెరిగి 30,932.90 వద్ద ముగియగా, నిఫ్టీ 50 ఇండెక్స్ 0.44 శాతం లేదా 40 పాయింట్లు పెరిగి 9,106.25 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 370 పాయింట్లు పెరిగింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు వరుసగా 0.76 శాతం, 0.72 శాతం అధికంగా ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీస్, రియాల్టీ సూచీలు 0.69 శాతం నష్టాలను నమోదు చేశాయి.
 
నిఫ్టీ 50 సూచికలో విప్రో, సన్ ఫార్మా, మారుతి, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, ఐటిసి, హీరో మోటోకార్ప్, భారతి ఇన్‌ఫ్రాటెల్, మరియు పిడిలైట్ అగ్రస్థానంలో ఉన్నాయి. కాగా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టి, హెచ్‌యుఎల్, బజాజ్ ఫైనాన్స్ ఇండెక్స్ ప్రముఖ నష్టపరులుగా మిగిలాయి.
 
తన రైట్స్ ఇష్యూ ఓపెనింగ్ కోసం చాలా కాలం నుండి వెలుగులోకి వచ్చిన ఆర్‌ఐఎల్, పెరిగిన మార్కెట్ ర్యాలీని ప్రేరేపించడానికి గొప్పగా ఏమీ చేయలేకపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఈ రోజు గరిష్ట స్థాయి 1461.45 ను తాకడం వలన తన  స్టాక్ రూ. 6.30 లేదా 0.44% పెరిగి, రూ. 1,440.00 ల వద్ద ముగిసింది.
 
బలహీన పడిన తయారీ మరియు శక్తి రంగం
తక్కువ డిమాండ్ మరియు ప్రజల సంపాదనా సామర్థ్యం తగ్గిపోతున్నందున, తయారీ మరియు ఇంధన రంగ వాటాలు ఈ రోజు కొట్టుమిట్టాడుతున్నాయి. నిఫ్టీ ఎనర్జీ 12,502.60 పాయింట్ల వద్ద ముగియడంతో ఇంధన రంగంలో స్టాక్స్ ధరలు 0.005 శాతం క్షీణించి, గణనీయంగా తగ్గాయి. బెల్వెథర్ ఎఫ్‌ఎంసిజి స్టాక్ హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ 1% క్షీణించి రూ. 1,970.70 ల వద్ద ముగిసింది
 
స్టాక్ మార్కెట్‌ను మందగింపజేసిన ఇన్ఫ్రా
ఈ రోజు ట్రేడింగ్ లో, ఇన్ఫ్రా రంగంలోని ఈక్విటీలు స్టాక్ మార్కెట్లను మందగింపజేసాయి. బుధవారం రోజున, నిఫ్టీ 50 చార్టులో అగ్రస్థానంలో ఉన్న ఇన్ఫ్రా బ్రాండ్లలో లార్సెన్ & టౌబ్రో లిమిటెడ్ ఉంది.  అయితే ఈ స్టాక్ గురువారం రోజు ముగింపు సమయానికి 14.00 లేదా 1.68% తగ్గి రూ. 821.00 ల వద్ద స్థిరపడింది.
 
మార్కెట్‌ను ప్రగతిపథం వైపు నడిపిన ఎయిర్ లైన్స్
మే 25 సోమవారం నుండి దేశీయ విమానాలు పునఃప్రారంభమవుతున్నాయనే సానుకూల వార్తలపై ఎయిర్‌లైన్స్ స్టాక్స్ నిఫ్టీకి మద్దతు ఇచ్చాయి. స్పైస్ జెట్ లిమిటెడ్ 5% పైగా లాభపడి రూ. 2.00 లేదా 4.90% పెరిగి రూ. 42.85 ల వద్ద ముగిసింది. ఈ ప్రకటన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ స్టాక్‌ను పెంచింది మరియు ఇది రూ .68.15 లేదా 7.47 శాతం పెరిగి, రూ. 980.05 ల వద్ద ముగిసింది.
 
గురువారం ట్రేడింగ్ ముగింపు సమయానికి, ఎయిర్ లైన్స్ కాకుండా, ఐటి టెక్నాలజీస్, కెమికల్స్ మరియు ఎసెన్షియల్ గూడ్స్ సరఫరా విభాగాలు భారీ లాభాలను పొందాయి.
 
- అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్