1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Couple's Suicide Due to Loan Burden

అప్పుల భారం తాళలేక దంపతుల ఆత్మహత్య.. అనాధలుగా నిలిచిన పిల్లలు

Couple
Couple
అప్పుల భారం తాళలేక దంపతుల ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కొత్తగా కట్టుకున్న ఇంటిని అమ్మినా అప్పులు తీరలేదు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నరేష్ (38), తన భార్య మేఘన (34) పిల్లలు ఆయాన్ష్ (9), మిథున్ (7)లతో కలిసి నివసిస్తుండేవారు.
 
సొంత ఇల్లు కొనుగోలు చేయడం కోసం ఈ దంపతులు కొద్ది నెలల క్రితం రూ. 90 లక్షల రుణం తీసుకున్నారు. అయితే ఆశించిన రుణం మంజూరు కాకపోవడంతో, ఇంటిని విక్రయించి కొంత అప్పును తీర్చారు. 
 
మిగిలిన అప్పు గురించి నరేష్ ఆందోళన చెందుతుండేవారని, అలాగే మానసిక వైద్యుని వద్ద చికిత్స కూడా పొందుతున్నారని బంధువులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో, పిల్లలు బడికి వెళ్లిన వెంటనే నరేష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, మేఘన పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది. మేఘన తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
కరీబా సరస్సులో పడవ బోల్తా : 15 మంది జలసమాధి...