సంబంధిత వార్తలు
- రైల్వే ప్రయాణికులకు అలెర్ట్ : 12 నుంచి 22 వరకు అనేక రైళ్లు రద్దు
- సికింద్రాబాద్ - వైజాగ్ల మధ్య మరో వందే భారత్ రైలు
- సికింద్రాబాద్ నుండి అయోధ్య, కాశీ-పూరీలకు పర్యాటక రైళ్లు
- భాగ్యనగరిలో తొలి డబుల్ డెక్కర్ కారిడార్.. రేపు సీఎం రేవంత్ శంకుస్థాపన
- సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి సన్నిధిలో ప్రధాని నరేంద్ర మోడీ
దక్షిణ మధ్య రైల్వే బుకింగ్ కౌంటర్లలో క్యూఆర్ కోడ్
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి, డిజిటల్ చెల్లింపులను పెంచడానికి, దక్షిణ మధ్య రైల్వే (SCR) సాధారణ బుకింగ్ కౌంటర్లలో టిక్కెట్లను కొనుగోలు చేయడానికి 'QR' (క్విక్ రెస్పాన్స్) కోడ్ ద్వారా చెల్లింపు సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది.
ఈ విధానం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. పైలట్ ప్రాజెక్టుగా ఎస్సీఆర్ సికింద్రాబాద్ డివిజన్లోని 14 స్టేషన్లలో 31 కౌంటర్లలో దీన్ని అమలు చేస్తున్నారు.
మొబైల్ ఫోన్లోని చెల్లింపు యాప్ల ద్వారా ప్రయాణీకులు దానిని స్కాన్ చేయవచ్చు. మొత్తం రసీదుని నిర్ధారించిన తర్వాత, టికెట్ జనరేట్ చేయబడుతుంది. ప్రయాణీకులక జారీ చేయబడుతుంది.
సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట, బేగంపేట, వరంగల్, మంచిర్యాల్, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి, ఫతేనగర్ బ్రిడ్జి, సిర్పూర్ ఖాగజ్నగర్, వికారాబాద్ స్టేషన్లలో ఈ నగదు రహిత లావాదేవీని తొలుత అమలు చేశారు.
