1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జూన్ 2024 (11:52 IST)

సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డుల పంపిణీ.. ముగ్గురి అరెస్ట్

cyber hackers
తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాల అక్రమ సేకరణకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పట్టుకుంది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో వారి వద్ద నుంచి 113 సిమ్ కార్డులు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. 
 
తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంక్లిష్టమైన సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌పై సమగ్ర దర్యాప్తును ప్రారంభించింది. ఈ క్రమంలో అంతర్జాతీయంగా దుబాయ్, థాయిలాండ్, కంబోడియా వంటి దేశాలలో సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాల హ్యాక్‌కు పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. 
 
అరెస్టయిన వారిలో జగద్గిరిగుట్టకు చెందిన షేక్ సుభాని (26), జీడిమెట్ల చింతల్‌కు చెందిన కె నవీన్ (22), ఎం ప్రేమ్ కుమార్ అలియాస్ మైఖేల్, ఆర్టీసీ ఎక్స్ రోడ్డుకు చెందిన మైక్ టిస్సన్ (24) ఉన్నారు. నిందితులు వివిధ వ్యక్తులు, సంస్థల గుర్తింపులను ఉపయోగించి సిమ్ కార్డులను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సిమ్ కార్డులు సైబర్ నేరగాళ్లకు పంపడం జరిగిందని దర్యాప్తులో తేలింది.