1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Women Lover Arrested For Killing Husband

Women Lover: ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది.. గుండెపోటు వచ్చిందని డ్రామా

crime scene
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని మారుతినగర్‌లో తమ ఇంట్లో భర్త లక్ష్మణ్ నాయక్ (38)ను హత్య చేసిన ఆరోపణలపై పోలీసులు పద్మ నాయక్, ఆమె ప్రియుడు రత్లావత్ గోపిని అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులేనని పోలీసులు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. నవంబర్ 25న తమ ఇంట్లో మరణించి కనిపించిన లక్ష్మణ్ నాయక్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతని కుటుంబ సభ్యుల నుండి వారికి ఫిర్యాదు అందింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొదట్లో, విచారణ సమయంలో పద్మ పోలీసులకు నవంబర్ 24వ తేదీ రాత్రి లక్ష్మణ్ నాయక్ మద్యం సేవించి ఇంటికి వచ్చి నిద్రపోయాడని చెప్పింది. 
 
మరుసటి రోజు ఉదయం తాను పాఠశాలకు వెళ్లేటప్పుడు కూడా అతను నిద్రలేవలేదని చెప్పింది. ఆ తర్వాత రోజు తాను ఇంటికి ఫోన్ చేసినప్పుడు ఎవరూ స్పందించలేదని తెలిపింది. దాంతో ఆమె ఇంటి యజమానికి ఫోన్ చేయగా, అతను వెళ్లి చూసి లక్ష్మణ్ ఇంకా మంచం మీదనే ఉన్నాడని చెప్పాడని తెలిపింది. 
 
పద్మ ఇంటికి తిరిగి వచ్చి చూడగా లక్ష్మణ్ చనిపోయి ఉన్నాడని, అది గుండెపోటు వల్ల జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు పోలీసులకు చెప్పింది. అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపారు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం, లక్ష్మణ్ నాయక్ ఊపిరాడక మరణించినట్లు తేలింది. 
 
అయితే పోలీసులు జరిపిన విచారణలో పద్మ కాల్ డేటాను సేకరించి, ఆమె తన సహోద్యోగి రత్లావత్ గోపితో సంప్రదింపులు జరుపుతున్నట్లు కనుగొన్నారు. పోలీసులు వారిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. వారి వాట్సాప్ డేటాను పరిశీలించగా, పద్మ గోపి సహాయంతో తన భర్తను హత్య చేయడానికి కుట్ర పన్ని ఉండవచ్చని పోలీసులు భావించారు. 
 
విచారణలో, తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో లక్ష్మణ్‌ను హత్య చేసినట్లు ఆ ఇద్దరూ ఒప్పుకున్నారు. పోలీసులు గురువారం పద్మ నాయక్, గోపిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
శ్రీశైలం టోల్ గేట్ వద్ద తనిఖీలు.. భారీ స్థాయిలో లిక్కర్ స్వాధీనం