సంబంధిత వార్తలు
- Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర
- Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్
- Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి
- మా డాడీ పొలిటికల్ కెరీర్ చివరి దశలో ఉంది : సీఎం సిద్ధరామయ్య కుమారుడు
- భవిష్యత్లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి
మొంథా ఎఫెక్ట్: భారీ వర్షాలు అవుసలికుంట వాగు దాటిన కారు.. కారులో వున్న వారికి ఏమైంది? (video)
Montha Cyclone
కల్వకుర్తి మండలం రఘుపతిపేట వద్ద దుందుభి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో కల్వకుర్తి - నాగర్కర్నూల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్కర్నూల్ జిల్లాలోని ఉప్పునుంతలలో అత్యధికంగా 20.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూల్, గద్వాల్, మహబూబ్ నగర్, నారాయణపేట, నల్గొండ, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షాలు పడతాయని, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది.
ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట- అంబటిపల్లి గ్రామాల మధ్య వాగు దాటేందుకు ప్రయత్నించి కారు చిక్కుకుపోయింది. కారులో చిక్కుకుపోయిన వారిని జేసీబీ సాయంతో అధికారులు కాపాడుతున్నారు. కారులో ఎంతమంది వున్నారు ఏంటి సంగతి.. కారులోని వారికి ఏమైంది అంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
వాగులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో ఇలా కారులో ప్రయాణం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ అధికారులు మండిపడుతున్నారు. సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, షాకింగ్ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతలా వరద ఉధృతి వున్న వాగును ప్రస్తుతం దాటుకుని వెళ్లడం అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
షాకింగ్ విజువల్స్
— Telugu Scribe (@TeluguScribe) October 29, 2025
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట – అంబటిపల్లి గ్రామాల మధ్య వాగు దాటేందుకు ప్రయత్నించి చిక్కుకుపోయిన కారు
కారులో చిక్కుకుపోయిన వారిని జేసీబీ సాయంతో కాపాడుతున్న అధికారులు pic.twitter.com/DczzMYwNZ0
