సంబంధిత వార్తలు
- ప్రాణాలు తీస్తున్న ఆంధ్రా రోడ్లు - గుంతలో పడి బైకర్ మృతి
- వెస్టిండీస్ను వైట్ వాష్ చేసిన భారత క్రికెట్ జట్టు
- కార్గిల్ యుద్ధం: వీరోచితంగా పోరాడిన పాక్ సైనికుడు.. భారత్ సిఫార్సుపై అత్యున్నత శౌర్య పురస్కారం ఇచ్చిన పాకిస్తాన్
- తమిళనాడులో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
- టైటానిక్ నటుడు డేవిడ్ వార్నర్ ఇకలేరు...
రంగారెడ్డి ప్యాకేజీ-1 పనుల్లో విషాదం ... క్రేన్ వైరు తెగిన ఐదుగురు కూలీల దుర్మణం
తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. రంగారెడ్డి ప్యాకేజీ-1 ఇర్రిగేషన్ పనుల్లో ఈ ఘటన జరిగింది. కొందరు కూలీలు పంప్ హౌస్లోకి దిగుతున్న సమయంలో క్రేన్ వైర్లు తెగిపోయాయి. దీంతో ఐదుగురు కూలీలు మృత్యువాతపడ్డారు. మృతులంతా బీహార్ రాష్ట్ర కూలీలుగా గుర్తించారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలం రేమనగడ్డ వద్ద శుక్రవారం తెల్లవారుజామున రంగారెడ్డి ప్యాకేజీ-1 పనులు చేసేందుకు కూలీలు ఉపక్రమించారు. ఇందుకోసం కొందరు కూలీలు పంప్హౌస్లోకి దిగుతున్న సమయంలో క్రేన్ వైరు ఒక్కసారిగా తెగిపడిపోయింది. దీంతో కూలీలు కిందపడి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో కూలీ తీవ్రంగా గాయపడ్డారు.
సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరిలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
