1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. 5 workers die after crane cable snaps in Telangana irrigation project

రంగారెడ్డి ప్యాకేజీ-1 పనుల్లో విషాదం ... క్రేన్ వైరు తెగిన ఐదుగురు కూలీల దుర్మణం

deadbody
తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. రంగారెడ్డి ప్యాకేజీ-1 ఇర్రిగేషన్ పనుల్లో ఈ ఘటన జరిగింది. కొందరు కూలీలు పంప్ హౌస్‌లోకి దిగుతున్న సమయంలో క్రేన్ వైర్లు తెగిపోయాయి. దీంతో ఐదుగురు కూలీలు మృత్యువాతపడ్డారు. మృతులంతా బీహార్ రాష్ట్ర కూలీలుగా గుర్తించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలం రేమనగడ్డ వద్ద శుక్రవారం తెల్లవారుజామున రంగారెడ్డి ప్యాకేజీ-1 పనులు చేసేందుకు కూలీలు ఉపక్రమించారు. ఇందుకోసం కొందరు కూలీలు పంప్‌హౌస్‌లోకి దిగుతున్న సమయంలో క్రేన్ వైరు ఒక్కసారిగా తెగిపడిపోయింది. దీంతో కూలీలు కిందపడి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో కూలీ తీవ్రంగా గాయపడ్డారు. 
 
సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరిలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌లో పాము - రైలు 2 గంటల పాటు నిలిపివేత