1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. BJP Leader Vijayashanti fires on KCR

కేసీఆర్‌కు ఆ భ‌యం పట్టుకుంది.. ఎన్ని జిమిక్కులు చేసినా?

KCR
కేసీఆర్‌కు ఓడిపోతాన‌నే భ‌యం ప‌ట్టుకుంది. అందుకే బీజేపీ కార్య‌కర్త‌ల‌పై దాడులు, నాయ‌కుల‌పై త‌ప్పుడు కేసులు పెడుతూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఫైర్ అయ్యారు. అందుకే రాష్ట్రంలో ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని విజయశాంతి మండిపడ్డారు. 
 
కేసీఆర్‌కు ఓడిపోతాన‌నే భ‌యం ప‌ట్టుకుందని ఆమె ఎద్దేవా చేశారు. ప్రతిరోజూ పూర్తి స్థాయిలో రిపోర్టు ఇవ్వాలని అటు ఇంటెలిజెన్స్‎కు, ఇటు డిపార్ట్‎మెంట్లకు కేసీఆర్ సర్కార్ నుంచి ఇంటర్నల్ ఆదేశాలు వెళ్లాయని రాములమ్మ చెప్పారు. 
 
ఈ ఆదేశాలు చూస్తే కేసీఆర్ మ‌ళ్లీ అధికారంలోకి రాడని తేలిపోయిందన్నారు. అందుకే అధికారుల‌ను ఉప‌యోగించుకుని అధికారం నిల‌బెట్టుకోవాల‌ని చూస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. 
 
"కేసీఆర్... నువ్వెన్ని రిపోర్టులు తెచ్చుకున్నా... ఎన్ని జిమ్మిక్కులు చేసినా... నీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజానీకం బంగాళాఖాతంలో కలప‌డం ఖాయం." అని విజయశాంతి హెచ్చరించారు. 
తర్వాతి కథనం
ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలు ఖరారు - రేట్ల వివరాలు ఇవే...