శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 జనవరి 2023 (15:00 IST)

ప్రధానికి కౌంటరిచ్చిన కేటీఆర్...

ktramarao
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు మంగళవారం ఒక కార్యక్రమంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలను ప్రధాని మోదీ పరిష్కరించలేకపోయారని ఆరోపించారు. 
 
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధాన్ని నివారించడంలో ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించారని బీజేపీపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ వాదనలను మంత్రి ఎగతాళి చేస్తూ, పొరుగున ఉన్న రెండు బీజేపీ పాలిత రాష్ట్రాల మధ్య రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించలేని ప్రధాని మోదీ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపగలరని నమ్మడం హాస్యాస్పదంగా ఉందన్నారు.