సంబంధిత వార్తలు
- సారీ, వాళ్లు నాపై అత్యాచారం చేయలేదు, 36 మంది మాత్రం: మిర్యాలగూడ యువతి
- హైదరాబాద్లో కోవిడ్ 19 పైన యుద్ధం: మేము సైతం అంటున్న న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్
- నాపై 139 మంది అత్యాచారం అబద్ధం, నన్ను ఒక్కరు కూడా చేయలేదు, అంతా డాలర్ బోయ్ భయంతోనే?
- పీవీ సింధు బయోపిక్.. దీపికా పదుకునే లీడ్ రోల్ చేస్తుందా..?
- గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ల పరారీ.. బాత్ రూమ్ గ్రిల్స్ తొలగించి ఖైదీలు..?
రేపు హుస్సేన్సాగర్కు ఖైరతాబాద్ మహాగణపతి, 50 వేల సీసీటీవి కెమేరాలతో...
బుధవారం హైదరాబాదులోని హుస్సేన్ సాగర్లో గణపతి నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుగనుంది. ఇందుకుగాను పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో సీసీటీవీ కెమేరాలు అమర్చారు.
పాత బస్తీ నుంచి వచ్చే గణేష్ విగ్రహాల తరలింపు కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. సూచించన ప్రాంతాల మీదుగా గణేష్ విగ్రహాల తరలింపు జరుగుతుందని పేర్కొన్నారు. కోవిడ్ నేపధ్యంలో భక్తులు సామాజిక దూరం పాటిస్తూ నిమజ్జన కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కాగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమేరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిమజ్జన కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగరంలో 15 వేల మంది పోలీసులు విధుల్లో వుంటారని ఆయన తెలిపారు.
