శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 అక్టోబరు 2022 (17:10 IST)

అక్టోబర్ 16న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష.. మెహందీ.. టాటూలకు నో.. 15 నిమిషాల ముందే?

అక్టోబర్ 16న అంటే ఆదివారం గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. 16వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుంది. ఉదయం 8.30 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే గేట్లను మూసివేస్తారు. అంటే 10.15 గంటల తర్వాత కేంద్రంలోకి అనుమతించరు.

అభ్యర్థులందరికీ బయోమెట్రిక్‌ విధానంలో హాజరును నమోదు చేయనున్నారు. ఇప్పుడు నమోదుచేసే బయోమెట్రిక్‌ వివరాలను మెయిన్‌ పరీక్ష సమయంలో పోల్చి చూస్తారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్‌ ఐడీ, ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.  

మొబైల్‌ ఫోన్‌, ట్యాబ్‌, పెన్‌డ్రైవ్‌, బ్లూటూత్‌, వాచ్‌, కాలిక్యులేటర్‌, వాలెట్‌, పర్స్‌, నోట్స్‌, రికార్డింగ్‌ పరికరాలను అనుమతించరు. అలాగే జ్యువెలరీ, షూ ధరించరాదు. చేతులు లేదా పాదాలకు మెహందీ, టాటూలు ఉండకూడదు. రాష్ట్రంలోని 1,019 కేంద్రాల్లో ఈ పరీక్షలు వుంటాయి.

గ్రూప్‌-1కు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో శుక్రవారం రాత్రి వరకు సుమారు 3.21 లక్షల మంది అభ్యర్థులు హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇక వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మెయిన్‌ పరీక్షను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.