సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు మండలం పాటి సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైలో కారును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు సురక్షితంగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో కారులో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతులు జార్ఖండ్ ఘోరఖ్పూర్, రాంఘడ్కు చెందిన కార్పెంటర్లుగా గుర్తించారు. గచ్చిబౌలి నుంచి...