సంబంధిత వార్తలు
- గర్ల్ఫ్రెండ్ గిఫ్టుల కోసం దొంగలైన వైద్య విద్యార్థులు.. ఎక్కడ?
- డిగ్రీ కళాశాలల సమస్యల్ని తీర్చండి మహాప్రభో!
- కరాటే, కుంగ్ ఫూ పోటీలలో గుంటుపల్లి సెయింట్ ఆన్స్ విద్యార్థుల ప్రతిభ
- ప్రధాని మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ - బిట్ కాయిన్స్కు ఆమోదమంటూ..
- చెత్తబుట్టతో టీచర్పై దాడి.. స్టూడెంట్స్ ఓవరాక్షన్.. వీడియో వైరల్
ఏది రాసినా పాస్ చేస్తానని ఫెయిల్ చేశారు.. కేటీఆర్కు ట్వీట్
తెలంగాణ ఇంటర్ తొలి సంవత్సరం ఫలితాలను గురువారం ప్రకటించింది. ఈ ఫలితాలు సగానికి సగం మంది కూడా ఉత్తీర్ణత సాధించలేదు. దీంతో విద్యార్థులు మానసికంగా కృంగిపోయారు. దీంతో విద్యాశాఖ అప్రమత్తమైంది.
కానీ అనుకున్న విధంగానే ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటానని ట్విట్టర్ వేదికగా మంత్రులు కేటీఆర్, సబితలను ట్యాగ్ చేస్తూ హెచ్చరించాడు. తాను నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానని, ఏది రాసినా పాస్ చేస్తా అని చెప్పి అందరినీ ఫెయిల్ చేశారు అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.
తీరా పోస్ట్ వైరల్ అవడంతో.. తాను ఇప్పుడు బాగున్నానని, తనకు మోటివేట్ చేసినందుకు కృతజ్ఞతలు అంటూ మరో ట్వీట్ చేశాడు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సైకాలజిస్టులను నియమించింది తెలంగాణ విద్యా శాఖ.
