శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 డిశెంబరు 2021 (09:40 IST)

గర్ల్‌ఫ్రెండ్ గిఫ్టుల కోసం దొంగలైన వైద్య విద్యార్థులు.. ఎక్కడ?

ఇద్దరు వైద్య విద్యార్థులు తమ ప్రియురాళ్ళ కోసం దొంగలుగా మారారు. గర్ల్‌ఫ్రెండ్స్ కోసం విలువైన బహుమతులిచ్చి, వారిని సంతృప్తి పరిచేందుకు ఓ నగల దుకాణంలో బంగారు ఆభరణాలను చోరీచేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ ఘటన మహాష్ట్రలోని పూణెలో వెలుగు చూసింది. నిందితులను సంజయ్ జగ్తాప్, అనిల్‌కేత్ హనుమత్ రొకడేలుగా గుర్తించారు. వీరిద్దరిలో ఒకరు బీఎస్సీ నర్సింగ్ చేస్తుంటే, మరొకరు బీఏఎంఎస్ విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరిద్దరూ తమ ప్రియురాళ్లకు విలువైన బహుమతులు ఇచ్చేందుకు చోరులుగా మారినట్టు విచారణలో తేలింది. 
 
ముఖ్యంగా, పూణెలోని హదాప్సర్, కొత్రుడ్ ప్రాంతాల్లోని బంగారు షాపుల్లో చోరీలకు పాల్పడినట్టు విచారణలో వెల్లడైంది. దుకాణాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో నమోదైన ఫుటేజీల ఆధారంగా ఈ ఇద్దరు దొంగలను పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ కలిసి 36 గ్రాముల బంగారం నగలను చోరీ చేసినట్టు చెప్పారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.