1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Munugode Bypoll Voting Begins

మునుగోడు ఉప ఎన్నిక పోరు : ప్రారంభమైన పోలింగ్

polling
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఓ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్య కోమటిరెడ్డి లగడపాటి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఈ ఉప పోరు అనివార్యమైన విషయం తెల్సిందే. ఇందులో మొత్తం 241855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 
 
వీరిలో 50 మంది సర్వీస్ ఓటర్లు కాగా, 80 యేళ్లు పైబడిన వారు 2,576 మంది ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు 5,686 మంది ఉండగా, 730 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాలను ఏర్పటాు చేశారు. వీటిలో 105 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ బూత్‌లుగా గుర్తించారు. 
 
కాగా, ఎన్నికలో అధికార తెరాస, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు బీఎస్పీ, టీజేఎస్‌లకు చెందిన మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర? ఇంటివద్ద రెక్కీ : నాదెండ్ల మనోహర్