1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Osmania University PG Time Table

OU Exams: చివరి సెమిస్టర్ విద్యార్థులకు అలెర్ట్

Osmania University
తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలను జూలై మొదటివారంలో జరగనున్నాయి. ఈ మేరకు యూనివర్సిటీ తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. చివరి సెమిస్టర్ విద్యార్ధులు ఈ నెల 22వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాల్సి వుంటుంది.
 
అలాగే రూ. 300 ఆలస్య రుసుముతో ఈ నెల 28 వరకు చెల్లించేందుకు అవకాశం ఉందని వర్సిటీ వర్గాలు సూచించాయి. పరీక్షల ఫీజు, టైం టేబుల్, ఇతరత్రా విషయాల కోసం విద్యార్ధులు ఓయూ అఫీషియల్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని వర్సిటీ అధికారులు సూచించారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కొత్త కోడలికి మెట్టు మెట్టుకు నోట్ల కట్ట, అత్త అదిరిపోయే వెల్కమ్...