1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (21:05 IST)

మహబూబ్‌నగర్‌లో నాగుపాము..

నాగుపాము మహబూబ్‌నగర్‌లో కలకలం రేపింది. చెట్టుపై బుసలు కొడుతూ.. పడగవిప్పి రెండు గంటలకు పైగా చెట్టుపైనే వుంది. దీంతో పామును చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. 
 
స్థానిక ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఖాళీ స్థలంలో కొంతమంది రైతులు మిరపకాయలు ఎండబెట్టారు. ఆ సమయంలో అక్కడ కుక్కలు అరవడం మొదలుపెట్టాయి.
 
కుక్కల అరుపులు విన్న ఓ వ్యక్తి ఆ ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ చెట్టుపై నాగుపాము పడగవిప్పి బుసలు కొడుతోంది. దీంతో ఆ దృశ్యాన్ని సెల్ ఫోన్‌లో రికార్డు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.