1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Telangana Govt objection to form Krishna Board in Vizag

సంబంధం లేని ప్రాంతంలో కృష్ణా బోర్డు ఏర్పాటా? : తెలంగాణ మెలిక

Telangana Govt
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం తమకు సమ్మతం కాదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది తమకు అనుకూలం కాదని పేర్కొంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. 
 
విజయవాడలో ఏర్పాటు చేస్తామంటే అంగీకారం తెలిపామని, ఇప్పుడు కృష్ణా బేసిన్‌కు బయట, సంబంధం లేని ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల కార్యకలాపాలకు ఇబ్బందవుతుంది. 
 
అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో కూడా ఈ విషయం చర్చించకుండా అకస్మాత్తుగా విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తామని చెప్పడం సరైంది కాదంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు సోమవారం లేఖ రాశారు.
 
దీంతోపాటు కృష్ణా బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్‌ మరికొన్ని ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినట్లు కూడా బోర్డు దృష్టికి తెలంగాణ తెచ్చింది. ఇటీవల పరిపాలనా అనుమతి ఇచ్చిన మూడు ప్రాజెక్టుల గురించి వివరించినట్లు తెలిసింది. 
తర్వాతి కథనం
జో బైడెన్ ప్రమాణ స్వీకారం : భద్రతా వలయంలో శ్వేతసౌధం (ఫోటో ఫీచర్)