శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 జూన్ 2021 (11:41 IST)

తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపు..? కేసీఆర్ అత్యవసర భేటీ

తెలంగాణలో శనివారం (జూన్ 19) తోనే లాక్‎డౌన్ ముగియనున్న నేపథ్యంలో కొవిడ్ పరిస్థితుల రీత్యా రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించాలా వద్దా..? లేకుంటే నైట్ కర్ఫ్యూ విధించాలా..? అనే దానిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్ ఉంది. అయితే శనివారం చేయబోయే ప్రకటన ఎలా ఉంటుందన్న దానిపై రాష్ట్ర ప్రజానికంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ శనివారం అత్యవసరంగా సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో భేటీకి రావాల్సిందిగా మంత్రులకు ఇప్పటికే సమాచారం వెళ్లింది. నిజానికి లాక్ డౌన్ పొడగింపు లేదా ముగింపునకు సంబంధించి శుక్రవారమే ప్రకటన వస్తుందని భావించినా, శనివారం జరగబోయే అత్యవసర కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకుంటారని ఆలస్యంగా వెల్లడైంది.