1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Telangana : Wife attack on husband

కూలి డబ్బుల గొడవ... భర్త మర్మాంగం కోసిన భార్య

కూలి డబ్బుల విషయమై జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా భర్త మర్మాంగాన్ని భార్య కోసేసింది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట గ్రామంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Telangana
కూలి డబ్బుల విషయమై జరిగిన చిన్నపాటి గొడవ కారణంగా భర్త మర్మాంగాన్ని భార్య కోసేసింది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట గ్రామంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
సిరిసేడుకు చెందిన రౌతు రవీందర్, స్వరూపలకు 25 యేళ్ళ కిందట వివాహమైంది. కూలి డబ్బుల విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కూలి పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన రవీందర్ భోజనం చేసి నిద్రపోయాడు. 
 
ఈ సమయంలో స్వరూప కూరగాయల కత్తితో రవీందర్ మర్మాంగం కోసింది. అతను కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి విషయం తెలుసుకుని రవీందర్‌ను జమ్మికుంట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
బ్రెజిల్‌లో 245 మంది... 30 మీటర్ల ఎత్తు నుంచి దూకేశారు.. (వీడియో)