గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 1 జూన్ 2019 (10:13 IST)

సాయిపల్లవి చీటింగ్... మండిపడిన ఫ్యాన్స్..

తమిళ హీరో సూర్య - సాయి పల్లవి - రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన చిత్రం "ఎన్.జి.కె" (నంద గోపాల కృష్ణ). ఈ చిత్రం మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ చిత్రం హీరోయిన్లలో ఒకరైన సాయి పల్లవి తన అభిమానులను మోసం చేసిందట. దీంతో ఆమెపై అభిమానులు ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఫిదా భామ... దిగివచ్చి ఫ్యాన్స్‌కు సారీ చెప్పిందట. ఇంతకు ఫ్యాన్స్‌ ఆమె ఎలా మోసం చేసిందో తెలుసుకుందాం.  
 
తమిళ హీరో సూర్య - సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్‌లు కలిసి నటించిన చిత్రం ఎన్.జి.కె. ఈ చిత్రం మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందే ఈ అమ్మడు అభిమానులతో చిట్‌చాట్ చేయాలనీ, సినిమా విశేషాలను పంచుకోవాలని భావించిందట. అందుకు టైమ్‌ కూడా ఫిక్స్ చేసి సోషల్ మీడియాలో అభిమానులకు తెలియపరిచింది. 
 
అయితే.. కొన్ని కారణాల ఈ భామ అభిమానులతో చాట్ చేయలేకపోయింది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ చాటింగ్ కోసం మేము ఎదురుచూస్తూంటే నువ్వు చీటింగ్ చేస్తావా..? అంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో.. అభిమానులకు సారీ చెప్పి, మళ్లీ సోషల్ మీడియాలో కలుద్దాం అంటూ సాయిపల్లవి తెలివిగా తప్పించుకుంది.