1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. 7 Kgs Silver Coins Seized from Passenger at RGIA

శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో ఏడు కిలోల వెండి నాణేలు స్వాధీనం

Silver
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం నాడు ఒక ప్రయాణికుడి నుంచి 7 కిలోల వెండి నాణేలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది ప్రవేశ ద్వారం వద్ద సదరు ప్రయాణికుడిని అడ్డుకుని, అతని బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో వెండి నాణేలు బయటపడ్డాయి. 
 
న్యూఢిల్లీకి వెళ్లే విమానం ఎక్కడానికి అతను సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ వెండి నాణేల  విలువను తెలుసుకోవడానికి సీఐఎస్ఎఫ్ అధికారులు ఆర్జీఐఏ పోలీసుల సహకారంతో ప్రయాణికుడిని విచారిస్తున్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
రూ.700 అప్పు చెల్లించడంపై వివాదం : మధ్యలో కల్పించుకున్న వ్యక్తి దారుణ హత్య