త్రిష ఓ పరాన్నజీవి, ఆమె అంటే నాకు అస్సలు ఇష్టం లేదు: సుచిత్ర
సుచిత్ర లీక్స్ తో ఆమధ్య కోలీవుడ్ సినీ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపిన సుచిత్ర మళ్లీ ఇన్నాళ్లకు వార్తల్లోకి వచ్చేసింది. ఏకంగా త్రిష పైనే వ్యాఖ్యలు చేసింది. ఇవి కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ సుచిత్ర చేసిన కామెంట్స్ ఏమిటో తెలుసుకుందాం.
త్రిష అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. త్రిష ఓ పరాన్నజీవి. ఎందుకంటే... విజయ్ ప్రస్తుతం తన భార్యాపిల్లలకు దూరమై ఒంటరిగా వున్నారు. ఇలాంటి సమయంలో ఈ పారసైట్స్ వంటి వ్యక్తులు విజయ్ జీవితంలోకి ప్రవేశిస్తారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఆమె పేర్కొంటూ... విజయ్ ఒంటరితనాన్ని వాడుకుని కొంతమంది ఆయనకు భారంగా మారుతున్నారని త్రిషపై పరోక్ష వ్యాఖ్యలు చేసింది.
