నవ్యాంధ్రకు మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా, అమరావతిని మరో ప్రాంతానికి తరలించడానికి వీల్లేదంటూ 29 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం మంచిదేనని చెప్పారు. అయితే, పాలన అంతా ఒకే చోట ఉండాలన్నది తన అభిప్రాయమన్నారు. ...