గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By వరుణ్
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2023 (11:16 IST)

మొన్న విమానంలో.. నేడు ఆర్టీసీ బస్సులో.. మహిళపై మూత్ర విసర్జన చేసిన యువకుడు

ksrtc
కొందరు యువకులు మహిళల పట్ల అసభ్యంగా, అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. మొన్నటికిమొన్న విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన ముందు సీట్లో కూర్చొనివున్న ఓ వృద్ధురాలైన మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోశాడు. ఈ ఘటన పెను దుమారమే రేపింది. ఎయిరిండియా విమానంలో 70 యేళ్ల వృద్ధురాలిపై శంకర్ మిశ్రా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఇపుడు ఇలాంటి ఘటనే కర్నాటక ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సులో మంగళవారం జరగ్గా ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
విజయపుర నుంచి మంగుళూరుకు వెళుతున్న ఈ ఆర్టీసీ బస్సు హుబ్బళ్ళి సమీపంలోని కిరేసురులోని ఓ డాబా వద్ద ఆగింది. ప్రయాణికులంతా మూత్ర విసర్జన చేసేందుకు, టీ సేవించేందుకు బస్సు దిగారు. అయితే, 28వ నంబరు సీటులో కూర్చొనివున్న మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న రామప్ప (25) అనే యువకుడు బస్సు ముందు వరుస సీట్లో కూర్చొనివున్న మహిళపై మూత్ర విసర్జన చేశాడు. గాఢ నిద్రలో ఉన్న ఆమె ఈ అకస్మాత్తు చర్యతో ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ నిద్రలేకి బిగ్గరగా కేకలు పెట్టింది. దీంతో బస్సులోని మిగిలిన ప్రయాణికులంతా నిద్రలేచారు. 
 
లాగే, కిందకు దిగిన ప్రయాణికులంతా ఒక్కసారిగా బస్సులోకి వచ్చి, నిందితుడుని పట్టుకుని దేహశుద్ధి చేసి బస్సు నుంచి కిందకు దించేశారు. ఆ తర్వాత మహిళా ప్రయాణికురాలు డాబాలోని గదిలోకి వెళ్లి స్నానం చేసి వచ్చేంత వరకు బస్సును ఆపారు. పీకల్లోతు మద్యంమత్తులో ఉన్న రామప్ప.. దిక్కుతెలియక ఈ పాడుపనికి పాల్పడ్డాడు. అయితే, ఈ ఘటనపై మహిళ పెద్ద మనసుతో పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఎలాంటి కేసు నమోదు చేయలేదు.