గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2022 (20:57 IST)

గుత్తి బామ్మ వద్దకు వెళ్తే..రెండు రూపాయలకే ఇడ్లీ.. తెలుసా? (video)

sambar idly
తమిళనాడులో ఓ బామ్మ తక్కువ ధరకే ఇడ్లీలు అమ్మిన సంగతి తెలిసిందే. ఈ వార్త నెట్టింట వైరల్ అయ్యింది. తాజాగా గుత్తికి చెందిన ఓ వృద్ధురాలు తక్కువ ధరకే ఇడ్లీలు, దోశలు అమ్ముతూ పేదల ఆకలి తీర్చుతోంది. తానే పేదరికంలో మగ్గుతున్నా.. సొంత లాభం కొంత వదులుకుంటూ జీవన యాత్రను కొనసాగిస్తోంది. 
 
స్థానిక బండగేరికి చెందిన వెంకటలక్ష్మి 28 ఏళ్ల నుంచి దోసెలు, ఇడ్లీలు అమ్ముతోంది. రూ.10కి మూడు దోశలు, అదే రూ.10కి ఐదు ఇడ్లీలు ఇస్తోంది. ఏడు పదుల వయసులోనూ ఆమె చిన్నకొట్టుతో జీవనం సాగిస్తోంది. 
 
రోజురోజుకు నిత్యావసరాల ధరలు పెరుతున్నా ఆమె మాత్రం తక్కువ దరకే ఇడ్లీలు, దోశలను విక్రయిస్తోంది. అతితక్కువ ధరకే ఇడ్లీలు, దోశలను అమ్ముతుండటంతో రోజూ తెల్లవారగానే అవ్వ వద్దకు అల్పాహారం కోసం వెళుతుంటారు. తక్కువ ఖర్చుతోనే ఆకలి తీర్చుకుంటున్నారు. 
 
రూ.10కే టిఫిన్‌ పెడుతున్న వెంకటలక్ష్మి అవ్వను ఎప్పటికీ మరువలేమని పిల్లలు, పెద్దలు అంటున్నారు. ఆమె పేదరికంలో వుందని ఆమెను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.