మంగళవారం, 13 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (22:26 IST)

పంజాబీ అమ్మాయికి కడుపు చేసాడన్న పోసాని: కేసు పెట్టిన జనసేన

పోసాని కృష్ణమురళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పంజాబీ అమ్మాయికి కడుపు చేశారని డబ్బులు ఇచ్చి అబార్షన్ చేయించుకోమని అన్నారని పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా మంగళవారం నాడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్బులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరింత దారుణమైన వ్యాఖ్యలు చేసారు. దీనిపై జనసేన తెలంగాణ ఇంఛార్జ్ నాదెండ్ల మనోహర్ కేసు పెట్టినట్లు తెలుస్తోంది.
 
మరోవైపు పవన్ ఫ్యాన్స్ పోసానిని అడ్డుకునేందుకు ప్రెస్ క్లబ్బుకి పెద్దఎత్తున చేరుకున్నారు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోసానిని సురక్షితంగా జీపులో ఎక్కించుకుని వెళ్లారు. ఐతే తనకు పవన్ ఫ్యాన్స్ వల్ల ప్రాణహాని వుందనీ, తనకు ఏదయినా జరిగితే పవన్ కళ్యాణ్ దే బాధ్యత అని అన్నారు.