1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (17:23 IST)

తగ్గేదే లే, ఎక్కడున్నాయి గ్రామ సింహాలు అంటూ పవన్ ట్వీట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి వైసిపి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ ద్వారా మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు.
 
ఆయన ఇలా ట్వీట్ చేసారు. ''ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రగతి! హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వై.సి.పి. పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన  ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం. ఎక్కడున్నాయి వై.సి.పి. గ్రామ సింహాలు?'' అంటూ పేర్కొన్నారు.